ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభిస్తున్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని,మహిళ సంఘాలకు చాలా ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ములుగు జిల్లా ప్రజలు ఇండియన్ బ్యాంక్ సేవలు సద్వినియోగపర్చు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,ఇండియన్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
