* హైదరాబాద్ దశ-దిశ మార్చే ప్రణాళికలపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీహెచ్ ఎంసీ విలీనం, అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అలాగే 6.30 గంటలకు బెంగళూరు-హైదరాబాద్ కొత్త నేషనల్ హైవేపై కూడా చర్చించనున్నారు. హైదరాబాద్ దశ-దిశ మార్చే ప్రణాళికలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమీక్షలు నిర్వహించనున్నారు. నిన్న రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక మార్గదర్శకంగా రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ పాలసీ(TG Rising Policy) డాక్యుమెంట్ పై రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సిద్ధం చేసిన ముసాయిదాను పరిశీలించి, భవిష్యత్ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధోరణులను పునర్వ్యవస్థీకరించి, ఆర్థిక రంగ ప్రగతిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా తెలిపారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
