
* ఛైర్పర్సన్గా జయసుధ నియామకం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్పర్సన్గా నటి జయసుధను ఎంపిక చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలో 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. జయసుధ, ఎఫ్డీసీ ఎండీ హరీశ్లతో సమావేశమైన ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక పక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు గుర్తుచేసిన దిల్ రాజు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లురాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డన్ర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు వెల్లడిరచారు.
……………………………………