
* సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
* వరంగల్లో ఎలక్ట్రిక్ల బస్సులకు మంత్రుల ప్రారంభం
* ఓరుగల్లును పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామన్న మంత్రి పొంగులేటి
ఆకేరున్యూస్, వరంగల్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ గృహాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు సాంక్షన్ చేస్తామన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించామని.. 80 లక్షల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వాటిని స్క్రూటినీ చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్దిదారులకు అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకోని వారు భయపడాల్సిన పనిలేదని.. ఇందిరమ్మ గృహాలు అనేది నిరంతర పక్రియ, అర్హులకు తప్పకుండా ఇస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి అందిస్తామన్నారు.అలాగే ఓరుగల్లును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. నగరంలో భద్రకాళి ట్యాంక్ బండ్, టెక్స్ టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు వెల్లడిరచారు. వరంగల్ రీజియన్కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో సోమవారం 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు. మరో 25 బస్సులను సంక్రాంతి లోపు, మిగతా వాటిని ఆ తర్వాత ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సవిూక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలగకుండా తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామన్నారు. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడిరచారు. హైదరాబాద్కు ఏ టెక్నాలజీ వచ్చినా వెంటనే దాన్ని వరంగల్కూ తెస్తామని.. ఉమ్మడి ఏపీలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. 4.5 లక్షల గృహాలను ఇప్పుడు మొదటి విడతలో ఇస్తామన్నారు. రైతు భరోసాపై వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎకరానికి రూ.12 వేలు చొప్పున రైతు భరోసా కింద ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని.. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్కార్డులు అందిస్తామన్నారు.
…………………………………..