
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ కు బాగా డిమాండ్ పెరిగిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar babu) తెలిపారు. అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు అనంతరం మాట్లాడారు. ఢిల్లీ, చెన్నయ్ తో పోలిస్తే హైదరాబాద్(Hyderabad)లో 56 శాతం వృద్ది ఉందన్నారు. ఆమెజాన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ వంటి సంస్థలు వచ్చాయని వివరించారు. మారియట్, సిగ్నా వంటి అంతర్జాతీయ సంస్థలూ వచ్చాయన్నారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సంస్థలు హైదరాబాద్కు తరలివచ్చాయని వెల్లడించారు. 2030 నాటికి జీడీపీలో తెలంగాణ (Telangana) వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
……………………………………..