
* ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఆకేరున్యూస్ డెస్క్ : ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్లో భారత్ నుంచి యూఎస్కు వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. విమానాల రద్దుకు సంబంధించిన ఆయా ప్రయాణికులకు సమాచారం అందించినట్లు ఎయిర్లైన్ పేర్కొంది.
………………………………………