
ఆకేరున్యూస్, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు హకీంపేట ఎయిర్ ఫోర్స్స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
……………………………………………….