* అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో పర్యటించి రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 గ్రామాల్లో సుమారు 50 కోట్లతో రహదారుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కాగా, పవన్ కళ్యాణ్ను చూడడానికి అభిమానులు పెద్దఎత్తున్న తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అభిమానులను నేను కోరేది ఒక్కటే. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వండి. నేను బయటికి వచ్చినప్పుడు మీరు నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేనన్నారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దామంటే అందరూ ఇక్కడే ఉండడంతో ఏం కనిపించట్లేదన్నారు. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవని.. నేను పనిచేస్తే మీ ఫ్యూచర్కి మంచి జరుగుతుందని అభిమానులకు పవన్ రిక్వెస్ట్ చేశాడు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
