
* మంత్రి కొండా సురేఖ
ఆకేరున్యూస్, హైదరాబాద్: వరంగల్లో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను శనివారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు కొండా సురేఖ వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రంలో పెండిరగ్లో ఉన్న రైల్వే పనులు చేయాల్సిన కార్యక్రమాల గురించి అరగంటకు పైగా తమతో చర్చించి సానుకూలంగా స్పందించారని అన్నారు. వరంగల్కు సంబంధించి తాము అడిగిన సమస్యలతో పాటు వరంగల్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామని అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్ వేరుగా ఏర్పాటు చేయాలని కోరామన్నారు. డోర్నకల్ భద్రాచలం రైల్వే లైన్ ఉంది కానీ బ్రిడ్జి పూర్తి కాలేదని.. దానిపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడి సమస్యలపై వినతి పత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ఏపీలో ఐదు డివిజన్లు ఉన్నాయని… హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం వరంగల్కు ఎయిర్పోర్ట్ వచ్చిందని తెలిపారు. వరంగల్కు ఎయిర్పోర్ట్ను ఎవరో వచ్చి తామిచ్చామని చెప్పుకుంటే పర్వాలేదన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. అన్నింటిని అభివృద్ధి చేసుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండిరగ్లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్తో సహా తదితర అంశాలపై విజ్ఞప్తి చేయగా.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ను అతిపెద్ద రెండో రాజధానిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేయాలనుకుంటున్నారని అన్నారు.వరంగల్లో ఎయిర్పోర్ట్ కళా సాకారం అవుతున్న వేల దానికి అనుగుణంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే సదుపాయాన్ని ఇవ్వడంతో పాటు చింతనపల్లిలో ఉన్న కాకతీయ టెక్స్టైల్ పార్కుకు కావలసిన విధంగా రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరామని చెప్పారు. వెంటనే స్పందించిన అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. పాండురంగాపురం – మల్కాన్ గిరి రైల్వే లైన్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజతలు తెలిపారు. పాండురంగాపురం – మల్కాన్ గిరి రైల్వే లైన్ ను సారపాక (భద్రాచలం)వరకు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని లేఖ ద్వారా మంత్రి తుమ్మల కోరారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు,పెనుబల్లి నుంచి కొండపల్లి వరకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని లేఖలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
…………………………………….