
* ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలి
* విసికె రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టర్కు ఫిర్యాదు
ఆకేరున్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పున్నీలు గ్రామంలోని బాబాయ్ కుంట (తురకకుంట)ను కాపాడటం గురించి అయినవోలు మండలం పున్నేలులో తురకకుంటను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని, తుర్కకుంటను ఆక్రమించిన రియల్టర్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విముక్త చిరుతల కచ్చి (విసికె) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వందల ఏండ్లుగా ప్రజలకు వ్యవసాయానికి ఉపయోగపడుతున్న బాబాయ్ కుంట తురక కుంట అని కూడా పిలుస్తారు .రియల్ ఎస్టేట్ వారు ఆక్రమించి ఫ్లాట్ చేసి అమ్ముతున్నారని, ఈ కుంట యొక్క ఎఫ్ టీ ఎల్ మరియు బఫర్ జోన్ ను అధికారులు గతంలో నిర్ధారించారు. చెరువులు కుంటలు అక్రమ కబ్జాకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది రియల్టర్లు తుర్కకుంటను ఆక్రమించి, అమాయకులైన ప్రజలకు లక్షల రూపాయలకు అమ్ముతున్నారని విసికె వర్కింగ్ ప్రెసిడెంట్ చెరిపెల్లి ఆనంద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు కుంటలు వాగులు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని వాటిని కాపాడాలని విసికె అనుమకొండ జిల్లా కమిటీ పోరాడుతున్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చెరువును కబ్జా చేస్తున్న వాళ్ల మీద చర్యలు తీసుకోకపోతే, విసికె ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధపడుతుంది అని చెరిపెల్లి ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా వైదిక పార్టీ అధ్యక్షులు కన్నాల రవి, జిల్లా నాయకుడు సుమన్ బాబు తదితరులు కలెక్టర్ను కలిశారు.
…………………………………………