* ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్రం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. జమ్ము కశ్మీర్ , పంజాబ్ , రాజస్థాన్ , గుజరాత్లో రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ ఉంటాయని వెల్లడిరచింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
……………………………

