* చౌటుప్పల్లో ఇద్దరు దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బ్రేకులు ఫెయిలు కావడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద హైదరాబాద్- విజయవాడ (Hyderabad-Vijayawada)జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందారు. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఘటన జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
