
* తెలంగాణ బిడ్డ ఈటల కూడా మాట్లాడడం లేదే
* గోదావరి – బనకచర్లను ఆపే బాధ్యతను ఆయనే తీసుకోవాలి
* అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్.. రాజకీయ కమిషన్
* కేసీఆర్కు నోటీసులంటే యావత్ తెలంగాణకు ఇచ్చినట్లే
* బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత
* తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్(KCR)కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత (KAVITHA)ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే, మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అన్నారు. కాళేశ్వరం కమిషన్ కాదది.. కాంగ్రెస్ కమిషన్.. రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కాళేశ్వరం (KALESWARAM) పూర్తయితే 30 శాతం తెలంగాణకు నీళ్లు అందిస్తుందన్నారు. కేసీఆర్ ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని తెలిపారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదన్నారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి (REVANTHREDDY) చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల (ETALA) కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. గోదావరి – బనకచర్లను ఆపే బాధ్యతను ఈటల తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చే బాధ్యతనూ ఆయన తీసుకోవాలన్నారు.
…………………………………………………………