
* ఇరాక్ లో చిక్కుకున్ 120 మంది భారతీయులు
* దేశానికి తీసుకురండి : అసదుద్దీన్ ఒవైసీ
ఆకేరు న్యూస్, జగిత్యాల : ఉపాధి కోసం దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతలకు గుండెపోటుతో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. ఉపాధి కోసం ఇజ్రాయెల్ (Israel)వెళ్లిన జగిత్యాల వాసి రెవెళ్ల రవీందర్ (57) అక్కడ ఇరాన్ – ఇజ్రాయోల్ (Iran-Israel) భీకర దాడులతో గుండెపోటుకు గురయ్యారు. టెల్ అవీవ్ ఆసుపత్రి బంకర్లో చికిత్స పొందుతూ మరణించారు. రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎన్నారై కమిటీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి సహాయం కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విద్య, ఉపాధి నిమిత్తం ఆ దేశాలకు వెళ్లిన భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈక్రమంలో ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. మా నాన్నమృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకురావాలని రవీంద్ర కుమార్తె ఆకాంక్ష భారత రాయబార కార్యాలయాన్ని కోరినట్లు వెల్లడించారు.
స్వదేశానికి తీసుకురండి
మతపరమైన యాత్రలో భాగంగా ఇరాక్కు వెళ్లి, ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన షియా ముస్లింలను దేశానికి చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాక్ సహా పలు దేశాలలో విమానయాన సేవలను రద్దు చేయడంతో మతపరమైన యాత్రలలో భాగంగా ఇరాక్ వెళ్లిన భారతీయ షియా ముస్లీంలు 120 మంది అక్కడ చిక్కుకుపోయారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వారిని దేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని , విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ బృందాన్ని కలుసుకున్న సందర్భంలో ఆయన అభ్యర్ధించారు.
…………………………………………..