
* యోగా జీవితంలో అంతర్భాగం కావాలి
* యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది
* యోగాతో శరీరానికి శుద్ది లభిస్తుంది
*నగరంలో యోగా సెంటర్ల సంఖ్య పెరగాలి
*యోగాపై అవగాహన కల్పించాలి
* ప్రతీ రోజూ యోగా చేద్దామని ఉన్నా..ప్రజాసేవలో సాధ్యం కావడం లేదు
*వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్ హనుమకొండ : యోగాతో మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా మారుతాడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ , ఆయుష్ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డా కడియం కావ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని సూచించారు . యోగాతో మనస్సుకు ప్రశాంతతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు.ప్రపంచమంతా మన సంప్రదాయలను ఆదరించే చేసిన ఆత్మీయ సాధన అని కొనియాడారు.శరీరంలో ఉన్న రుగ్మతలను యోగా దూరం చేస్తుందని నాయిని అన్నారు . పట్టణ ప్రజలకు యోగా సెంటర్లపైన అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు. మరిన్ని యోగా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాయిని అన్నారు. ప్రతీ రోజూ యోగా చేయాలని ఉన్నా ప్రజాజీవితంలో ఉన్నందున్న అది సాధ్యం కావడం లేదని ఎమ్మెల్యే నాయిని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,సుగుణాకర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్,మాడిశెట్టి సతీష్ మరియు యోగ నిపుణులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………