
– స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, జనగామ: దేవాదుల ఎత్తిపోతల పనుల ప్రగతి పైన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ లతో కలిసి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మంగళవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పనులు వేగవంతం కావాలన్నారు. అశ్వరావుపేట కుడి ప్రధాన కాలువ పనులను నెల రోజులలో పూర్తి చేయాలన్నారు. మొత్తం 20డిస్ట్రిబ్యూటరీస్ తో పాటు సబ్ మైనర్స్ లో కూడా సిల్ట్ రిమూవల్, జంగల్ క్లియర్ చేయాలని, అశ్వరావుపల్లి కుడి కాలువ చాలా ప్రధానమైనదని ఆశించిన స్థాయిలో పనులు జరగాలన్నారు. ఒక్క 20L కిందనే 14వేల ఆయకట్టు ఉందని, నెల రోజుల్లో 1L నుండి 20L వరకు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఘనపూర్ నుండి నవాబ్ పేట ప్రధాన కాలువ లో 10డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయని 1L ఉప్పుగల్, తిమ్మంపేట, 2L సముద్రాల, నారాయణ పురం, సూరారం వరకు సిల్ట్ రిమూవల్ చేయాలన్నారు. 4L లో కూడా సిల్ట్ రిమూవల్ చేయాలని 4L లో షేటర్ పెట్టలన్నారు. నవాబ్ పేట అప్రోచ్ ఛానల్ క్లిన్ చేయాలన్నారు. ప్యాకేజి 1,2,3లను వెంటనే పూర్తి చేయాలని, సమస్యలు ఉంటే పరిష్కరించాలని పంపుహౌస్ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు మల్లన్న గండి కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ సీజన్ లో నీరు ఇవ్వాలని, దేవాదుల పేస్ 1,2,3లలో పూర్తి స్థాయిలో పంపింగ్ చేయాలన్నారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ లో లిఫ్ట్ చేయడానికి సరిపోను నీటి లభ్యత ఉందని, పంపుహౌస్ ల మెయింటనెన్స్ ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలన్నారు .
డిమాండ్ కు ముందే పంపింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు
ముందుగానే రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలన్నారు. ధర్మసాగర్ నుండి నీటి డిస్ట్రిబ్యూషన్ పై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు ధర్మసాగర్, ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్లను 20రోజుల్లో నింపాలని ధర్మసాగర్ నార్త్, సౌత్ కెనాల్స్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పెషల్ డ్రైవ్ గా చేపట్టిన తక్కువ ఖర్చు తో ఇంకుడు గుంతల నిర్మాణం కి సంబందించిన పోస్టర్ ని ఆవిష్కరించి ఇంకుడు గుంత నిర్మాణాన్ని కలెక్టరెట్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ , శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారభించారు. ఈ సమావేశం లో ఇరిగేషన్ సి ఈ అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఘనపూర్ AMC చైర్మన్ లావణ్య, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ లు, ఆర్థివో లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.
…………………………………………………….