
– మత్తు పదార్థాలపై అవేర్నెస్ తో పాటు, ఐడిఫికేషన్ చేస్తున్నాం
– మత్తు పదార్థాల కి సంబంధించిన సమాచారాన్ని యువత 1908 నెంబర్ కి అందించండి.
– కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి
ఆకేరు న్యూస్,కమలాపూర్ : డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించడమే పోలీసు వ్యవస్థ లక్ష్యం అని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం సాయంత్రం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏంటి డ్రగ్ అవేర్నెస్ వీక్ , నషా ముక్త్ భారత్ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారన్నారు.మత్తు పదార్థాల నిర్మూలనకై యువతకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దాంతో పాటు మత్తు పదార్థాల వాడకం, అక్రమ రవాణాలను గుర్తిస్తున్నామని అన్నారు. మత్తు ఏ రూపంలో ఉన్నా కూడా యువత వాటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని వాడడం వల్ల యువత యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించి, సహజ ప్రతిస్పందన కోల్పోయి శరీరాన్ని చచ్చుబడేలా చేస్తుందని , మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తుందని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్కు బానిసవ్వడం వల్ల యువత వారి జీవితాలల్లో మంచి భవిష్యత్తును, ఆరోగ్యాన్ని కోల్పోయారని మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ని ఏర్పాటు చేసిందన్నారు.కాజీపేట పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో పాటు సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన ఆరా తీస్తున్నామన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై 100కు లేదా 1908 కి ఫోన్ చేసి సమాచారం అందించి వాటి నిర్మూలనకు కృషి చేయాలని ఏసీపీ యువతను కోరారు.కార్యక్రమంలో కమలాపూర్ పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ, మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కవిత రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….