* నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రులు పొన్నం ప్రభాకర్,దామోదర రాజనర్సింహ,కోమటి రెడ్డి వెంకటరెడ్డి,తుమ్మలనాగేశ్వర్ రావు
* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, హుస్నాబాద్ ః హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నంతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ,తుమ్మల నాగేశ్వర్ రావు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 11.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల మాతా శిషు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అలాగే 82 కోట్ల తో నిర్మించనున్న 250 పడకల ప్రభుత్వ వైద్యశాలకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 77:20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారి ని నాలుగు వరుసల రహదారిగా మార్చనున్నారు. ఈ రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొనన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించనున్న బహిరంగసభలో మంత్రులు పాల్గొంటారు.
…………………………………