* నోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: 2025-27 సంవత్సరాలకు గాను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటీఫికేషన్ విడుదల చేసింది. లిక్కర్ షాపు కోసం కనీస ధరను 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. లైసెన్స్ కాలాన్ని1-12-2025 నుండి 30-11-2027 వరకు నిర్ణయించారు. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం ఎస్సీ సామాజిక వర్గానికి 10 శాతం ఎస్టీ సామాజిక వర్గానికి 5 శాతం షాపులను కేటాయించనున్నారు. ఒకే దరఖాస్తుదారుడు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
