* భారీ వర్షాలే కారణం : టీపీసీసీ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కామారెడ్డిలో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించిన బీసీ డిక్లరేషన్ సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు టీపీసీసీ ప్రకటించింది. అయితే ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా తెలియజేయలేదు. త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని పీసీసీ పేర్కొంది. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు భావించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కూడా ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైన సభగా ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు అనూహ్యంగా వాయిదా పడడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది పార్టీ ప్రకటించకపోడంతో గందరగోళంలో పడ్డారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
