
ఆకేరున్యూస్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్కు మరోసారి నిరాశే ఎదురయింది. తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో ఉంటున్న ఆమె భూమి విూదికి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఐఎస్ఎస్ నుంచి సునీతతోపాటు బచ్ విల్మోర్ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా`స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్లో భాగంగా గురువారం జరగాల్సిన ప్రయోగం వాయిదాపడిరది. అమెరికాలోని ఎª`లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్య రావడంతో దీనిని ఆపేసినట్లు నాసా వెల్లడిరచింది. శుక్ర లేదా శనివారాల్లో ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగం మార్చి 25న జగాల్సి ఉంది. అయితే నాసా దానిని ముందుకు జరిపినా.. అది వాయిదాపడిరది. క్రూ`10 ద్వారా కొత్త బృందం ఐఎస్ఎస్కు చేరుకోగానే.. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండీవర్ ద్వారా సునీత, విల్మోర్లు భూమివిూదకు తిరిగి రానున్నారు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్కు చెందిన స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024, జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి విూదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్లైనర్ స్పేస్ క్రాప్ట్.. ఐఎస్ఎస్ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
…………………………….