
HMPV | భారత్ లోకి వచ్చేసిన కొత్త వైరస్
* బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు గుర్తింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్.. ప్రపంచమంతా వ్యాపించనుందా.. అనే చర్చ కొనసాగుతుండగానే, భారత్ లోకి వచ్చేసింది. బెంగళూరులో 2 హెచ్ఎంపివి (HMPV) కేసులు నమోదయ్యాయి. చైనాలో ప్రస్తుతం ఇది కలకలం సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది కూడా గాలి ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ పట్ల ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విస్తృతంగా వైరస్ నిర్ధారణ టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బెంగళూరులో 2 కేసులను గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాప హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జనవరి 4 న, రాష్ట్రంలో హెచ్ఎంపివి కేసులు నమోదు కాలేదని కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పుడు అధికారికంగా ధ్రువీకరించింది. ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్(ICMR) కూడా గుర్తించింది.
కొత్త వైరస్ లక్షణాలు ఇవే..
హెచ్ఎంపివి వైరస్ లోణాలు కూడా కొవిడ్ను పోలిన విధంగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నాటి జాగ్రత్తలనే తీసుకోవాలని సూచిస్తున్నారు. విడవని జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొంటున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా వివరిస్తున్నారు.
………………………………………..