
ఆకేరున్యూస్, హైదరాబాద్: తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
………………………………….