ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో కొన్ని గంటల పాటు హైదరాబాద్ మహానగరానికి కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. విద్యుత్ మరమ్మతు పనుల నేపథ్యంలో నగరానికి కృష్ణా జలాల పంపింగ్ను ఆరు గంటల పాటు నిలిపివేయనున్నారు. ఈ నెల 26న నగరంలో కృష్ణా జలాలు సరఫరా జరిగే ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1, 2, 3 పంపింగ్ ేస్టషన్లకు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని నాసర్లపల్లి వాటర్బోర్డు పంపింగ్ ేస్టషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లకు ఈ నెల 26నఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు టీజీ ట్రాన్స్కో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో నగరానికి మూడు ఫేజ్ల్లో నీటి పంపింగ్ ఆరు గంటల పాటు నిలిచిపోనుంది. దీంతో నగరంలో బుధవారం కృష్ణా జలాలు సరఫరా జరిగే ప్రాంతాలైనా చార్మినార్, వినయ్నగర్, బొజగుట్ట, రెడ్హిల్స్, నారాయణగూడ, ఎస్ఆర్నగర్, మారేడ్పల్లి, రియాసత్నగర్, కూకట్పల్లి, సాహెబ్నగర్, హయత్నగర్, సైనిక్పురి, ఉప్పల్, హఫీజ్పేట్, రాజేంద్రనగర్, మణికొండ, బోడుప్పల్, మీర్పేట్ డివిజన్ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం.
………………………………………………………..
