
* నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు
* బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ దేనని విమర్శించారు. నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని కవిూషన్ల కక్కుర్తితో అధిక వడ్డీకి వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. అప్పుల నుంచి బయటపడేందుకు తాము ప్రయత్నిస్తుంటే..బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ను పదేళ్లు పూర్తిగా పడుకోబెట్టారని ఆరోపించారు. లక్షా 85 వే లకోట్లు ఖర్చు చేసి ఎకరాకు నీళ్లివ్వలేదన్నారు ఉత్తమ్. సగం పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదు.. విభజన చట్టం అమలు కోసం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణకే 500 టీఎంసీలు కావాలని వాదన ప్రారంభించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే మహబూబ్నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదన్నారు. భారాస ప్రభుత్వం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. జగన్తో స్నేహంగా ఉంటూ.. ఏపీ జలదోపిడీకి భారాస సహకరించిందన్నారు. జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా, అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్నా కేసీఆర్ నోరెత్తలేదని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ.. భారాస నేత జేబులు నిండాయి. కాళేశ్వరంపై రూ.లక్షా 30వేల కోట్లు ఖర్చు చేస్తే మేడిగడ్డ కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వం కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదు. కృష్ణా జలాలను జగన్ ప్రభుత్వం బేసిన్ అవతలకు తరలిస్తుంటే పట్టించు కోలేదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు మన హక్కు అయితే 190 టీఎంసీల కంటే ఎక్కువగా ఎప్పుడూ వాడలేదు. కృష్ణా బేసిన్లో ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన వాటా పూర్తిగా వాడుకునేవాళ్లం. ఏదుల, దిండి ప్రాజెక్టులను కూడా పదేళ్లలో పూర్తి చేయలేదని ఉత్తమ్ విమర్శించారు. ఈక్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగిస్తామని 2021-22లో బీఆర్ఎస్ ఒప్పుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగిస్తామని 2021లో బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు. 2023 నవంబర్ లో సాగర్ ను ఏపీ ఆక్రమించింది.. ఏపీ ఆక్రమణ తర్వాతే సాగర్ సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లిందన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజు 4.2 టీఎంసీలు తీసుకెళ్లారని చెప్పారు ఉత్తమ్. రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ హయాంలో రోజూ 9.6 టీఎంసీలు దోచుకెళ్లారని ఆరోపించారు ఉత్తమ్. కృష్ణా నీళ్లను ఏపీకి దోచి పెట్టినందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడిరచారని విమర్శించారు. హరీశ్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా కాదు..అసలు దేనికి పనికి రాడన్నారు. తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడుతామని వ్యాఖ్యానించారు.ఏపీ నీళ్ల దోపిడికి పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు . జగన్ దోస్తీ కోసం రాయలసీమ లిప్ట్, పోతిరెడ్డిపాడు వదిలేశారని చెప్పారు. పదేళ్లలో శ్రీశైలం నుంచి ఔట్ సైడ్ బేసిన్ 1200 టీఎంసీలు తరలించారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. 298 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత,చేతగాని తనం వల్లే పాలమూరుకు నీటి కష్టాలు వచ్చాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం టెలిమెట్రీ పరికరాలు కూడా పెట్టలేదని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ కూలితే ఒక్క పిల్లరే కూలిందని వాదిస్తున్నారు. వాళ్లే కట్టారు..వాళ్లే దోచుకున్నారు..వాళ్లే కూలగొట్టారు. కాళేశ్వరం అప్పులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ భారమే. పాలమూరుకు వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నిళ్లివ్వలే. నీళ్ల కోసం కాదు బీఆర్ఎస్ నేతలు జేబులు నింపేందుకు కట్టారన్నారు. కృష్ణా నీళ్లలో ఏపీ దోపిడిని కేంద్రానికి వివరించాం.. కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఏపీ నీళ్ల దోపడిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
……………………………………..