
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తున్నందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు. సోమవారంఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఢల్లీిలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ‘‘తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఢల్లీిలో బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. తదనంతరం ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ కేసు నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
……………………………………..