
– అప్రమత్తమైన అధికారులు
ఆకేరున్యూస్, ముంబాయి : ముంబాయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయాన్ని పేల్చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్ వచ్చింది. అజర్బైజాన్కు వెళ్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు హెచ్చరించాడు. బెదిరింపు కాల్తో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విమానాశ్రయం ఆవరణలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………..