
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ బెదిరింపులు కావడం కలకలం రేపింది. ఓ ఆగంతకుడు సైబరాబాద్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా, ఈ బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలింది. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. అయితే, నిందితుడికి మతిస్థిమితం లేదని అధికారులు తెలిపారు.
………………………………….