* ఎస్సీ వర్గీకరణ విజయం మాదిగల పోరాట ఫలితం – సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: “ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం ఒక జీవో కాదు, అది కొన్ని దశాబ్దాల మాదిగ జాతి ఆవేదన, పోరాటం మరియు త్యాగాల ప్రతిఫలం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శిల్పకళా వేదికలో జరిగిన ధన్యవాద సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోరాటాలే పునాదులు వర్గీకరణ సాధన కోసం మాదిగలు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని సీఎం కొనియాడారు.
బలిదానాల స్మరణ
ఈ పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని గుర్తుచేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తున్నానని, మాదిగల పక్షాన నిలబడటమే న్యాయమని భావించినట్లు తెలిపారు. గతంలో అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తినందుకు తనను సభ నుంచి బయటకు గెంటేశారని, అయినా సరే వెనక్కి తగ్గకుండా పోరాడానని ఆయన గుర్తుచేశారు. తెలంగాణే ప్రథమం మాదిగల వైపే న్యాయం అని అన్నారు.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన తర్వాత, దేశంలోనే వర్గీకరణ అమలుకు అంగీకారం తెలిపిన తొలి రాష్ట్రం తెలంగాణేనని సీఎం గర్వంగా ప్రకటించారు.
“వర్గీకరణ విషయంలో మాదిగ సామాజికవర్గం వైపు పూర్తి న్యాయం ఉంది. ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎందరు అడ్డుపడినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీ వెంటే నిలబడ్డాను” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం – ఇచ్చిన మాటకు కట్టుబడి..
రాష్ట్రంలో మార్పు అనేది కేవలం ఒక పార్టీ ఓటమి కాదని, అది ప్రజల ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు.
సమిష్టి విజయం
అంతా కలిసికట్టుగా పోరాడబట్టే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడటం సాధ్యమైందని అన్నారు.తమ ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేసేది కాదని, చేతలతో నిరూపించే ‘కమిట్మెంట్’ ఉన్న ప్రభుత్వమని ఉద్ఘాటించారు.
ఉద్యోగుల పాత్ర
మాదిగ ఉద్యోగులు సమాజంలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అట్టడుగు వర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సత్కార గ్రహీతగా సీఎం ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపి, వెంటనే అమలు దిశగా అడుగులు వేయడంపై మాదిగ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు పాల్గొన్నారు.
