
* తప్పిన ప్రమాదం
* సురక్షితంగా ప్రయాణికులు
శ్రీకాకులం, ఆకేరున్యూస్: ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధికారులు పలాస వద్ద నిలిపివేయగా.. విడిపోయిన బోగీలను సిబ్బంది రైలుకు బిగిస్తున్నారు. దీంతో గంట నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
………………………………..