
* జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు
* పరిహారం చెల్లించాలని కలెక్టర్ కు వినతి
* న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ
ఆకేరు న్యూస్, జనగామ: జాతీయ రహదారి 365 నిర్మాణంలో భాగంగా పట్టణంలోని ఏకశిలా పెట్రోల్ పంప్ ప్రాంతంలో ప్లాట్లను కోల్పోతున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ పంపు పరిసర ప్రాంతాల్లో ఇండ్ల ప్లాట్ల జాగాలను కోల్పోతున్న బాధిత యజమానులకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పొజిషన్ కబ్జా ఆధారంగా మానవతా దృక్పథంతో నష్టపరిహారం చెల్లించాలని బాధిత ప్లాట్ ఓనర్స్ కమిటీ అధ్యక్షులు బూడిది గోపిడిమాండ్ చేశారు .శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షేక్ రిజ్వన్ భాషా కు బూడిది గోపి మెమోరాండం ఇచ్చారు. ఈసందర్భంగా బూడిది గోపి మాట్లాడుతూ 20 -30 సంవత్సరాల క్రితం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, ప్రైవేటు గుమస్తాలు కాయకష్టం చేసుకుని జనగామలో ప్లాట్లు కొనుక్కున్నారని అన్నారు. ఆ రోజుల్లో డిజిటల్ సర్వేలు లేఅవుట్ ప్లాన్ తో ప్లాటింగు చేయలేదని, ఏదో రకంగా ఉపయోగం భవిష్యత్తులో ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి ఇళ్ల స్థలాలు కొనుక్కొని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. ఈరోజు జాతీయ రహదారి పోతున్న దాంట్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నెంబర్ కు ఫిజికల్ సర్వే నెంబర్ కు మ్యాచ్ కావడం లేదన్నారు. అందు వల్ల బాధిత ప్లాటుదారులకు అన్యాయం చేయవద్దని ఫిజికల్ పొజిషన్ ఆధారంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కు వివరించినట్లు గోపి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ దీనికి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం జరిగేలా న్యాయమైన నష్టపరిహారం కూడా అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పి జగన్మోహన్ రావు ఎన్ ఉపేందర్ రెడ్డి, జి తిరుపతిరెడ్డి, ఈ వీరయ్య ఎండి జావిద్, రమావత్ మహేందర్, అవధూత వెంకటేశ్వర్లు, యేలా జనార్దన్, చిదంబరం చంద్రయ్య, నంద వెంకటేష్, బాధిత ప్లాట్ ఓనర్స్ పాల్గొన్నారు.
…………………………………………