
* తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టాలి
* బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గం ఇంచార్జి
ఆకేరు న్యూస్, ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి తెలిపారు. ఈ మేరకు సోమవారం రోజున ములుగు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి దిష్టిబొమ్మ దగ్ధం తో పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ కెసిఆర్ సారథ్యంలో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్ర అత్యున్నత చట్టం సభ ఆయన తెలంగాణ అసెంబ్లీలోని నాలుకోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆరోపించారు.పోరాటాలతో సాధించిన తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ ఆరాటపడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఏపీకి గోదావరి జిల్లాలను రాసి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయని అన్నారు. అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన బాగోతం తప్ప ఇంకోటి కాదు అని ఆరోపించారు. కాళేశ్వరంపై సిపిఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్య భావిస్తున్నామని అన్నారు, ఒక వైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోడీ ముగ్గురు కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలు తెరతీశారని తెలిపారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలకు బలి చేసేందుకు సిద్ధమైనరని అన్నారు. తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును బలి చేసేందుకు బాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల తోనే ఈ మొత్తం కుట్రలకు బీజం పడిందని తెలిపారు. ఒకవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లి ని తెరపైకి తెచ్చి మొత్తంగా మేడిగడ్డను ముంచే కూతంత్రం చేస్తున్నారు. తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నది ముగ్గురు కలిసి ఆడుతున్న పన్నాగమని ఆమె అన్నారు. కాళేశ్వరం కమిషన్ నుంచి సిబిఐ విచారణ దాకా ప్రతి దాని వెనక మోడీ చంద్రబాబు రేవంత్ ఈ ముగ్గురు హస్తం ఉందని ఆమె తెలిపారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని కోర్టులో నిలబడి గోష్ నివేదిక రుచిగా చూపెట్టి బిఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………