
ఆకేరు న్యూస్, అన్నమయ్య జిల్లా : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. సంబేపల్లి మండలం యర్రగుంట్ల దగ్గర రెండు కార్లు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (DEPUTY COLLECTOR RAMADEVI) మృతి చెందారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………….