
The Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman addressing a Post Budget Press Conference, in New Delhi on February 01, 2024.
* బడ్జెట్లో వ్యవసాయ, వైద్య రంగాలకు పెద్దపీట
* విద్యారంగానికి కూడా భారీగా కేటాయింపులు
* ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చాం
* మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ వెల్లడి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-2026 ఆర్ధిక సంవత్సర బ్జడెట్- రూపొందించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లోవ్యవసాయ, వైద్య రంగాలకు పెద్దపీట వేశామని తెలిపారు. విద్యారంగానికి కూడా భారీగా కేటాయింపులు చేశామన్నారు. ఇందులో ముఖ్యంగా 6 రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాంమని స్పష్టం చేశారు.అలాగే.. ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చామని.. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేశామని తెలిపారు. రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఉద్యోగులకు ఊరట కల్పించామన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పెంపుతో మిడిల్ క్లాస్ వర్గాలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. రూ.8 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఇప్పటి వరకు రూ.30 వేలు పన్ను కట్టేవారని.. ఇకపై ఏమి కట్టనక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉన్నామని.. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపర్చామన్నారు. ఈ బ్జడెట్లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పెరుగుతోన్న అవసరాలకు తగినట్లు విద్యుదుత్పత్తి, పంపిణికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదని వెల్లడిరచారు. దీనివల్ల అదనంగా కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు రూ.30వేలు పన్ను కట్టేవారు. ఇకపై ఏవిూ కట్టనక్కర్లేదు. అలాగే మిగతా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట కల్పించాం. రూ.12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ పెంపుతో కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలమ్మ వెల్లడిరచారు. ‘ఆర్థికవ్యవస్థలోని ప్రతీ అంశాన్నీ స్పృశించేలా బడ్జెట్ను రూపొందించాం. ఖర్చు చేసే ప్రతీ రూపాయి విషయంలో అత్యంత వివేకంతో వ్యవహరించాం. వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్నిరకాల మార్పులకు శ్రీకారం చుట్టాం. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతు ఇస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం. ఈ బ్జడెట్లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. పెరుగుతున్న అవసరాలకు తగినట్లు విద్యుదుత్పత్తి పంపిణీకి ప్రాధాన్యమిచ్చాం. అవసరమైన మూలధన వ్యయం కల్పించామని ఆర్థిక మంత్రి వివరించారు.
…………………………………………….