
* అనర్హులకు ఇళ్లు కేటాయించారు
* ఇళ్ల మంజూరు లో అక్రమాలు
* కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలి
* సన్న వడ్లకు బోనస్ చెల్లించాలి
* హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
* మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్ ములుగు : జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆమె అన్నారు. . జిల్లాలలో అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టబెట్టారని విమర్శించారు . అసలైన లబ్ధిదారులను జాబితాలో చేర్చకుండా పార్టీ కార్యకర్తలకు, డబ్బులు చెల్లించిన వారికి ఇంళ్లు మంజూరు చేశారని ఆమె ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలలో ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు., కౌలు రైతులకు పూర్తి స్థాయిలోరైతు భరోసా వర్తింపచేయలేదన్నారు. సన్న ధాన్యానికి ఇచ్చే 500 బోనస్ వెంటనే చెల్లించాలని రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇండ్లు కేటాయించపోతే పెద్ద ఎత్తు ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు దుండగుల మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, మహిళా మండల అధ్యక్షురాలు సామ నాగమ్మ,బీరెల్లి మాజీ సర్పంచ్ జాజా చంద్రం, గ్రామ కమిటీ అధ్యక్షులు దాయ రోశయ్య, మాజీ మండల ఉపాధ్యక్షులు పెనక విశ్వనాథం, జిల్లా నాయకురాలు ఇరుప విజయ, సమన్వయ కమిటీ సభ్యులు జీడి బాబురావు,సీనియర్ నాయకులు మోరే నరసింగరావు,భాషని సురేష్, బెజ్జూరి శ్రీకాంత్,బాగే రాములు, లక్ష్మణ్,గడదాసు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..