
*గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ..
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లా ఏటూర్ నాగారం, తాడ్వాయి మండలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం వారు, మండలలలోని. కాటాపూర్ , గంగారం , కౌశెట్టివాయి,ఏటూర్ నాగారం మండల లో ఆకులవారి ఘనపూర్ గ్రామాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 300 మంది నిరు పేద విద్యార్ధిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పెన్నులు,నోట్ పుస్తకాలు , పలకలు గ్రేస్ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాటాపూర్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాయం మానేశ్వరావు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం చాలా సంతోషకరమని ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు . మారుమూల గిరిజన గ్రామాలలో పేద పిల్లలకు సహాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం చాలా అభినందనీయమనీ, సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సిబ్బంది జి.యస్.యస్ ప్రతినిధులు ముర్రం రాజేష్, కంతి ముత్తయ్య, కె పుల్లారావు , ఉపాధ్యాయులు మల్లెల స్వప్న, వంశీ , వి రాంబాబు, జి రవీందర్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………