
* రేవంత్ రెడ్డి అన్న మళ్లీ సీఎం కావాలి
* కొండా మురళి
* క్రమ శిక్షణ కమిటీ ముందు ముగిసిన విచారణ
* రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు : మల్లు రవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నన్ను రెచ్చగొట్టొద్దని.. రేవంత్ రెడ్డి అన్న మళ్లీ సీఎం కావాలని మంత్రి కొండా సురేఖ భర్త, మురళి (KONDA MURALI) ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ(RAHUL GANDHI)ని ప్రధానిని చేయాలనే తపన తమ అందరిలోనూ ముందని మురళి తెలిపారు. కొందరి నేతలపై తన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దని వెల్లడిరచారు. ఆ వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను బలవంతుడినితో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రం తాను కమిటీని కోరానని వివరించారు. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అన్నారు. ఇదిలాఉండగా గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి విచారణ ముగిసింది. తాము నోటీసు ఇస్తే మురళి వచ్చాడని కమిటీ చైర్మన్ మల్లు రవి (MALLU RAVI) తెలిపారు. పార్టీ నేతలపై చేసిన వ్యాఖలపై ఆయన వివరణ ఇచ్చారని తెలిపారు. ఆయన నుంచి రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చారన్నారు.
………………………………………