
ఆకేరున్యూస్, రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడగా.. పోలీసుల వాహనంలో 15 మంది డీఆర్జీ జవాన్లు ఉన్నారు. కాగా.. 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కూంబింగ్ తర్వాత తిరిగి వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
…………………………………