* కేరళం, అస్సాం, పుదుచ్చేరి – ఏప్రిల్ -09
* తమిళనాడు ఏప్రిల్ – 23
* పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ – 23
సెకండ్ ఫేజ్ – ఏప్రిల్ – 29
* ఓట్ల కౌంటింగ్ – మే -04
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. నాలుగు రాష్ట్రాలకు పదవీ కాలం ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈమేరకు కేంద్ర ప్రధాన ఎన్నిల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు ఎన్నికల షెడ్యూల్ ఆదివారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ – ఏప్రిల్ 23, సెకండ్ ఫేజ్ – ఏప్రిల్ – 29 తేదీల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. కేరళ, అస్సాం , పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 9 వ తేది, తమిళ నాడు రాష్ట్రంలో ఏప్రిల్ 23 న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే విదంగా దేశంలోని మరో ఎనిమిది స్థానాల్లో ఉప ఎన్నికలు ఏప్రిల్ 23న ఎన్నిలకు జరుగుతాయి. ఈ మొత్తం ఎన్నికల ఫలితాలు మే 4 వ తేదీన ప్రకటిస్తారు.

