
* యాప్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పరిశీలించారు. ఈ యాప్లో ఒకటి రెండు మార్పు చేర్పులను మంత్రి సూచించారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేసి వచ్చే వారంలో యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తాం. ఇందుకు చేయాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని.. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని సూచించామన్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వినియోగించుకోవాలని తెలిపారు. పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు.
…………………………………………………