
* యోగా జీవితంలో అంతర్భాగం కావాలి
* ప్రపంచాలనికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా
* యోగాతో శారీరక ధృడత్వం..మానసిక ప్రశాంతత
* మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
*ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ డే
* పట్టణ ప్రజలు, రాజకీయ ప్రముఖులు,సెలబ్రిటీలతో
కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం
* జూన్ 21 యోగా అంతర్జాతీయ దినోత్సవం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యోగా జీవితంలో అంతర్భాగం కావాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా వల్ల మనిషికి యోగ్యత లభిస్తుందన్నారు. యోగాతో శారీరక దృఢత్వంతో మానసికంగా శక్తివంతులు అవుతారు అన్నారు. ప్రపంచానికి మోదీ అందించి గిఫ్ట్ యోగా అన్నారు.
నరేంద్రమోదీ ద్వారానే యోగాకు గుర్తింపు
యోగాను ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. యోగా అనేది సర్వరోగ నివారిణి అని ప్రతీ ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని కిషన్ రెడ్డి కోరారు. జూన్ 21 ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని కిషన్ రె్డి అన్నారు.
కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం
యోగా కౌంట్ డౌన్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కుష్బూ.మీనాక్షి చౌదరి,సాయి ధరమ్ తేజ్ తో పాటు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోగాసనాలు వేశారు.
…………………………………………..