
* అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
* విడతల వారీగా మంజూరు
* సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలి
* ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
ఆకేరు న్యూస్ ములుగుః రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న ఇందిరమ్మ గృహల తో పేదప్రజల కల సాకారం కాబోతుందని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బండారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు చైర్మన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు సకాలంలో నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలందరికీ దఫాల వారీగా ఇండ్ల మంజూరు అవుతాయన్నారు. ఇళ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులందరికీ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.ఇందిరమ్మ ఇండ్లపై ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు నెల్లుట్ల రాజన్న, ములుగు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, నాయకులు మహేందర్, అప్పని రామన్న ,వీరస్వామి, నాగిరెడ్డి, చిలువేరు సాంబయ్య, గుండె రాకేష్, గన్నెర్ల కిషన్, స్వామి, వీరస్వామి తోపాటు గ్రామస్తులు ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….