
* మూడో తరం నాయకుల్లో చెప్పుకోదగిన వారు కనిపించడం లేదు..
* విద్యార్థుల పోరాటం వల్లే … ప్రత్యేక రాష్ట్రం
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ
* రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయం
* ఎవరు ఏ పార్టీలో ఉన్నా నాయకుల్లో జాతీయ భావన ఉండాలి
* మాజీ గవర్నర్ విద్యాసాగర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అధికారపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy)అన్నారు. శాసనసభలో సభా నాయకుడికి ఇచ్చిన గౌరవాన్ని ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఆత్మకథ ఉనిక(Unika) పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వాజ్ పేయి(Vajpai), పీవీ నర్సింహరావు(Pv Narsimharao), జైపాల్ రెడ్డి, కేశవరావు, బండారు దత్తాత్రేయ తదితర నాయకుల తర్వాత మూడో తరం నాయకుల్లో చెప్పుకోదగిన వారు కనిపించడం లేదని తెలిపారు. పెద్దలందరూ ఒక వేదిక మీద కలవడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడిందని, నిర్వాహకులు అభినందనలు తెలిపారు. విద్యార్థి రాజకీయాల నుంచి విద్యా సాగర్ రావు(Vidya Sagar rao) ఎంతో ఎత్తుకు ఎదిగారని తెలిపారు. ఉస్మానియా వర్సిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రతినిధి నుంచి శాసన సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు. ఐదు దశాబ్దాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, వ్యక్తిగతంగా ప్రతిపక్షాలు కూడా విమర్శించని వ్యక్తి సాగర్ జీ (Sagar Ji)అని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనుభవజ్ఞులైన వీసీలను నియమించి, వర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశించానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఉస్మానియా, నిజాం కాలేజీల విద్యార్థులు ముందు భాగంలో నిలబడి పోరాటం చేశారు కాట్టే అన్నారు. విద్యార్థుల పోరాటం వల్లే … ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయం
రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయమని మాజీ గవర్నర్ విద్యా సాగర్ (VidyaSagar) కొనియాడారు. గిరిజన ప్రాంతంలో రూ.వేల కోట్ల సంపద ఉందని, వాటిని వెలికితీసి వారి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. హైడ్రా తరహాలో గిరిజన అభివృద్ది, భూ సమస్యల పరిష్కారానికి ఓ సంస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉ న్నా నాయకుల్లో జాతీయ భావన ఉంటుంది.. ఉండాలని తెలిపారు. రథయాత్ర సమయంలో ఎన్టీఆర్ అడ్వాణీని అశ్వమేథయాగం చేస్తున్నారని మెచ్చుకున్నారని తెలిపారు. అప్పట్లో వాజ్పేయిని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాలని పీవీ పంపారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ (Ntr)తన సినిమాల్లో బీసీ వాదాన్ని బలంగా చూపించారని, బీసీ వాదంతోనే ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్లో బుద్దుడి విగ్రహం పెట్టించారని తెలిపారు. యువతలోని శ్రమ శక్తిని బయటకు తీయడమే ఇప్పటి నేతల సవాలని తెలిపారు. యువతను ప్రోత్సహించకపోతే గంజాయి వంటి చెడు అలవాట్లకు లోనవుతారని అన్నారు. పుస్తకావిస్కరణలో హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కంభంపాటి, కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీజేపీ నేత బంగారు లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
………………………………..