* బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాల కూల్చివేతపై మొట్టికాయలు
* 18వ తేదీకి విచారణ వాయిదా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట ప్రైవేట్ భూ వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి యథాతథ స్థితిని కొనసాగించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం చెంది డిసెంబర్ 5 లోగా హాజరు కావాలని ఆదేశిస్తూ, లేకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని గతంలో హెచ్చరించింది. దీంతో ఆయన శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మకుంట పరిధిలోని స్థలం విషయంలో స్టేటస్ కో కొనసాగించాలని జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఏ సుధాకర్రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ పిటిషన్పై తొలుత అక్టోబర్ 31వ తేదీన విచారించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబర్ 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం నాడు రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తూ.. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా ఎందుకు కూల్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించారు. దీనికి వ్యర్ధాలనే తొలగించామని హైకోర్టుకి రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
……………………………………………..
