
* పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
* జిల్లాలో 3500 ఎకరాల్లో సాగు లక్ష్యం
* భారీ రాయితీతో డ్రిప్పు పరికరాల అందజేత
* సబ్సిడీపై మొక్కలు పంపిణీ అంతర పంట సాగు కు రాయితీ
* జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకెరు న్యూస్, జనగామ: తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ పైన దృష్టి సారించి దేశంలోనే మన రాష్టంలో మొదటి స్థానం లో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటన లో తెలిపారు. దేశానికే సరిపడా పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం రైతులకు ఉందని గమనించి ఉద్యాన శాఖ ద్వారా మొక్కలతో పాటు పంట సాగుకు అవసర అయ్యే డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ని రాయితీ పైన అందిస్తుందన్నారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తోందన్నారు. మొక్కల అందజేత నుంచి ఎరువులు, డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తోందని..ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర వర్గాల రైతులకు 80 శాతం చొప్పున రాయితీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు నాటిన 4 ఏట నుంచి 30 ఏళ్ల వరకూ రైతులకు ఆయిల్ పామ్ తోటల ఫలసాయం అందుతుందన్నారు
జనగాం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వివరాలు..
కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ ఎమ్ ఈ ఓ – ఓ పి పథకం కింద ఇప్పటి వరకు 2073 మంది రైతులు ,7055 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టారు.
జనగాం – 660.35 ఎకరాలు.
నర్మెట్టా – 338.04 ఎకరాలు.
బచన్నపేట – 885.67 ఎకరాలు.
తరిగొప్పులా – 338 ఎకరాలు.
దేవరుప్పుల – 621.39 ఎకరాలు.
కోడకండ్ల – 329.46 ఎకరాలు.
పాలకుర్తి – 744.56 ఎకరాలు.
జాఫర్గఢ్ – 488.14 ఎకరాలు.
లింగాల ఘనపూర్ – 727.05 ఎకరాలు.
రఘునాథపల్లి – 929.96 ఎకరాలు.
స్టేషన్ ఘనపూర్ – 571.90 ఎకరాలు.
చిల్పూర్ – 338.53 ఎకరాలు.
ఈ 2025-26సంవత్సరం లో 3500 ఎకరాలు లక్ష్యం కాగా..ఇందుకు గాను 663మంది రైతులని ,3060 ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేయుటకు గుర్తించారు
ఆయిల్ పామ్ సాగుతో అధిక రాబడి..
– పి. అనంత రావు, సుజాత, ముత్తారం గ్రామం, పాలకుర్తి మండలం, జనగామ జిల్లా
గతంలో పత్తి, మిర్చి సాగు చేసేది. కానీ తక్కువ ఆదాయం, మార్కెట్ ధర తక్కువ ఉండడం, అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. అందుకోసం ఈసారి జూన్, 2021వ సంవత్సరంలో ఆయిల్ పామ్ పంటను 36 ఎకరాలలో వేశాం. గెలల ఉత్పత్తి 140 మెట్రిక్ టన్నులు కాగా రూ. 24,00,833 స్థూల రాబడితో మిగిలిన నికర ఆదాయం రూ. 10,00,833/- దీంతో పాటు జిల్లా ఉద్యాన వన శాఖ నుంచి ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి రూ. 4200/- అందించారు. ఈ ఆయిల్ పామ్ సాగుతో అధిక రాబడి సాధిస్తున్నాం.
రైతు పండించిన అంతర పంటల వివరాలు:
మొక్కజొన్న,శనగలు మొదలగు పంటలు 15 ఎకరం లో పండించడం ద్వారా ఈ రైతు ఉత్పత్తి 10మెట్రిక్ టన్నులు ఉత్పత్తి సాదించినారు. రైతు కు అయినటువంటి
ఖర్చులు -30000/-
ఈ పంటల ద్వారా వచ్చిన
స్థూల రాబడి:70,000/-
నికర ఆదాయం: 40,000/- రూపాయలు. దీనితో పాటు జిల్లా ఉద్యాన శాఖ ఆయిల్ పామ్ సాగు చేసినందుకు మొదటి నాలుగు సంవత్సరంలో 4200 రూపాయలు/ ఎకరం కి చొప్పున మొత్తం 36 ఎకరం కి 6,04,800/- రాయితీ ఇవ్వడం జరిగింది. ఈ రైతు ఆయిల్ పామ్ మొక్కలకు నీరు బిందు సేద్యం ద్వారా అందించి, సేంద్రియ ఎరువులను వాడుకుంటూ అధిక దిగుబడి సాధిస్తున్నారు వీటితో పాటు సిఫారసు చేయబడిన రసాయన ఎరువులు అయినటువంటి యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,పొటాష్, సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ లను క్రమం తప్పకుండా అందించడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడులను ఇస్తున్నాయి. దీనివలన రైతు ఆదాయం పెరగడంతో సంతోషం వ్యక్తం పరిచ్చినారు. ఇప్పటివరకు 42మంది రైతులు 310 మెట్రిక్ టన్నులు గెలలను ఫ్యాక్టరీకి తరలించారని తెలిపారు. పెద్ద, చిన్న సన్న కారు రైతులు ఎవరైనా ఆయిల్ పామ్ పంటను వేసి అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు.
ఆయిల్ పామ్ పంట వేయుటకు ఆసక్తి గల రైతులను సంప్రదించాల్సిన నెంబర్లు:
1. ఎస్. శంకర్ – జిల్లా ఇంఛార్జి ఆయిల్ ఫెడ్ – 8374449386
2. ఎ. సాయి రక్షిత్ రెడ్డి – జిల్లా కో ఆర్డినేటర్ -9370269609
3. జి. హరిబాబు – జనగాం,నర్మెట్ట ఫీల్డ్ ఆఫీసర్ – 7981754361
4. ఎస్. శశి కుమార్ – బచన్నపేట,తరిగొప్పుల ఫీల్డ్ ఆఫీసర్- 9502669980
5. జి. సురేష్ – స్టేషన్ ఘనపూర్, చిల్పూర్ ఫీల్డ్ ఆఫీసర్ – 8919651559
6. పి. ప్రశాంత్ రెడ్డి – రఘునాథ పల్లి,లింగాల ఘనపూర్ ఫీల్డ్ ఆఫీసర్ -9100215730
7. పి.వరుణ్ – పాలకుర్తి, జాఫర్గడ్ – ఫీల్డ్ ఆఫీసర్ – 7093105417
8. ఆర్.హరికృష్ణ – దేవరుప్పుల, కొడకండ్ల – ఫీల్డ్ ఆఫీసర్ -8790600852
9. ఎ. మహర్షి – ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ -జనగాం, స్టేషన్ ఘనపూర్ – 9553606767
10. ఎస్. రాజేందర్ – ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ – పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ – 7995497073.
…………………………………………….