
* పైశాచిక ఆనందంలో ప్రభుత్వం
* కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టేది లేదు
* తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ ఎస్సే
* ఫార్ములా ఈ కారు రేస్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విచారణ పేరుతో ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అవసరం అయితే తనను అరెస్టు చేస్తారు కావొచ్చని, తెలంగాణలో గతంలో జైలుకెళ్లి వచ్చామని, హైదరాబాద్ (HYDERABAD) బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగా తీసుకున్న నిర్ణయంలో అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కాంగ్రెస్ (CONGRESS)ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఫార్ములా ఈ కార్ రేసు విచారణకు వెళ్లే ముందు నందినగర్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం అయ్యారు. అనంతరం బీఆర్ ఎస్ (BRS) భవన్లో పార్టీ నేతలు హరీశ్రావు, తదితరులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోర్టులు, చట్టం పై తమకు గౌరవం ఉందన్నారు. పెద్దలు కేసీఆర్, హరీశ్రావులను కాలేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టారని అన్నారు. వందసార్లు విచారణకు పిలిచినా వస్తానని, నిజాలే చెబుతానని అన్నారు. దమ్ముంటే లై డిటెక్టర్ (LIE DITECTOR) టెస్టు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు శ్రీరామ రాక్ష బీఆర్ ఎస్సే అన్నారు. 420 హామీలు, బీసీ డిక్లరేషన్ లపై రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. బీసీ ప్రజలు రేవంత్ ను గమనిస్తూనే ఉన్నారని, రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసిన రేవంత్ ను నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచంద్రారావు ఉన్నారు. విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీసు దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ బారీకేడ్లు ఏర్పాట్లు చేశారు.
…………………………………..