
* పాలకుర్తి ఎమ్మెల్యే యశ స్వినీ రెడ్డి
ఆకేరు న్యూస్,పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు.శనివారం కొడకండ్ల మండలంలో ఏడునుతుల, నర్సింగపురాం, లక్ష్మక్కపల్లి, రంగాపురం తో పాటు పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రెయినేజ్ వ్యవస్థలు లేక గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయన్నారు . గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి పనులకు సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించామన్నారు. నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ మెరుగు పర్చడానికి కృషి చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం నర్సింగపురాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే గారు, పార్టీ నాయకులకు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
………………………………………………