
* ప్రధాని మోడీకి సిఎం రేవంత్ వినతి
ఆకేరున్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానవిూ సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి టెర్మినల్ను ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నా సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డ్రైపోర్టు ఇవ్వాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి, మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. బందర్ పోర్ట్కు రైల్వే లైన్కు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానవిూ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలన్నారు.
డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడిరచారు. 1 ట్రిలియన్ ఎకానమి కాంట్రిబ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రిని సీఎం కోరారు. కాగా.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే… ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. అలాగే జనవరి 7 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్ప్రెస్ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.
…………………………………………….