
* చెట్లను,అడవులను రక్షించాలి
* డాక్టర్ తరుణ్ రెడ్డి సేవలు మరువలేనివి
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : విద్య ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపాలని విద్యార్థులకు విద్య అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క( SEETHAKKA) అన్నారు.ఆదివారం తాడ్వాయి మండలం మండల తోగు లో నూతనంగా నిర్మించిన పాఠశాలను మంత్రి సీతక్క, చక్రవర్తి ఆసుపత్రి డాక్టర్ తరుణ్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.( DIVAKARA) అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి( REGA KALYANI) లతో ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క,డాక్టర్ తరుణ్ రెడ్డితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గుత్తికోయ గూడాలలో చిన్నారులకు విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తుందని,ఈ ప్రాంతం అభయ అరణ్యంలో ఉండడం ద్వారా అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ తరుణంలోనే ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్ జి ఓ సంతోష్ 2020 కరోనా నుంచి ఈ ప్రాంతంలో మాతో కలిసి తమ సేవలను అందిస్తున్నాడని,చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యం గతం సంవత్సరం లో తక్కలపాడు లో స్కూల్ నిర్మించారని,ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని,సహకరించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు.
విద్య అందరి ప్రాథమిక హక్కు అని,గిరిజన ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్, డాక్టర్ తరుణ్ రెడ్డి, ఎన్జీవో సంతోష్ భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో డి ఎస్ పి రవిందర్,చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. తరుణ్ రెడ్డి, మండల అధికారులు డిప్యూటీ తాహాసిల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో సుమనావాణి, మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్,ఎన్ జి ఓ సంతోష్, ములుగు డిఎస్పి రవీందర్, సీఐ దయాకర్ ,ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పాక సాంబయ్య,చక్రవర్తి హాస్పిటల్ సిబ్బంది సూర్య ప్రకాష్, చారి, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ , స్థానిక మండల విద్యాధికారి, ఆర్ కేశవరావు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..