
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై నిర్వహించిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని పేర్కొన్నారు. గత పది నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం.. కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమమని.. రాష్ట్రంలో విద్యార్ధులు సౌకర్యాల లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 600 మంది విద్యార్ధులు 20 రూముల్లో ఉంటున్నారని.. 20 మందికి ఒక టాయిలెట్ కూడా లేని పరిస్థితులున్నాయని తెలియజేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ తీసుకువచ్చి నిరుపేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడ్డామన్నారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని.. కనీసం ఈ పాఠశాల ఏర్పాటునైనా అభినందించాలని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిపాదనలను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ని వర్గాల పిల్లలు చక్కగా చదువుకునేలా మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
……………………………..